తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: సీపీ
ABN , First Publish Date - 2020-04-08T10:02:34+05:30 IST
కరోనా వైరస్పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ద్వారకా
పొట్టిపాడు (ఉంగుటూరు), ఏప్రిల్ 7: కరోనా వైరస్పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. పొట్టిపాడు టోల్ప్లాజాను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లను పరిశీలిస్తూ పొట్టిపాడు టో ల్గేటుకు చేరుకున్న ఆయన ఇక్కడ తాజా పరిస్థితిని పరిశీలించారు.
ఆత్కూ రు పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీస్ బందోబస్తు, పహారా తదితర అంశాలపై ఈస్ట్ జోన్ ఏసీపీ మురళి, సీఐ కె.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. డీసీపీ హర్షవర్ధన్రాజు, ఆత్కూరు ఎస్సై వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.