కఠినంగా కొవిడ్‌ నిబంధనల అమలు

ABN , First Publish Date - 2022-01-19T06:07:49+05:30 IST

క్షేత్రస్థాయిలో కొవిడ్‌ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పల నాయుడు చెప్పారు.

కఠినంగా కొవిడ్‌ నిబంధనల అమలు
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ వెంకటఅప్పల నాయుడు

ఎస్పీ వెంకటఅప్పల నాయుడు


శ్రీకాళహస్తి, జనవరి 18: క్షేత్రస్థాయిలో కొవిడ్‌ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పల నాయుడు చెప్పారు. మంగళవారం ఆయన స్థానిక శ్రీరామ్‌నగర్‌కాలనీలోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ ఎస్పీ రికార్డులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. జిల్లాలో తొలి కరోనా కేసు శ్రీకాళహస్తిలో నమోదైందనీ, రాత్రి కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని గుర్తుచేశారు. వ్యాపారులు 11 గంటల వరకే లావాదేవీలు కొనసాగించాలనీ, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు సమావేశాలు, శుభకార్యాలు నిర్వహించాల్సి ఉందన్నారు. కాగా, బైండోవర్‌ కేసుల నమోదు పెంచడంతో, నేరాల శాతం తగ్గుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:07:49+05:30 IST