ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-20T04:59:23+05:30 IST

మండలంలోని దిగువరాచపల్లె గ్రా మం బలిజపల్లె, మాదంవాండ్లపల్లె, కల్లెవాండ్లపల్లె సమీపంలోని ఊరగుట్టను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి తహసీల్దార్‌ నరసింహులు హెచ్చరించారు.

ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు

వీరబల్లి, జూన్‌ 19: మండలంలోని దిగువరాచపల్లె గ్రా మం బలిజపల్లె, మాదంవాండ్లపల్లె, కల్లెవాండ్లపల్లె సమీపంలోని ఊరగుట్టను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి తహసీల్దార్‌ నరసింహులు హెచ్చరించారు. శనివారం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని చదును చేసిన ఊరగుట్టను పరిశీలించి బోర్డును నాటడం జరిగింది. ఇది ప్రభుత్వ స్థలమని ఎలాంటి వారైనా ఆక్రమించేందుకు ప్రయత్నించినా, ప్రవేశించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు కఠినచర్యలు ఉంటాయన్నారు. ఆయనతో పాటు ఆర్‌ఐ సమ్మద్‌ఖాన్‌, వీఆర్‌వో సంజీవ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:59:23+05:30 IST