కొవిడ్‌ వైద్యం చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-17T06:13:24+05:30 IST

గ్రామాల్లో ఆర్‌ఎంపీ, పీఎం పీలు కొవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ ఆన్నారు.

కొవిడ్‌ వైద్యం చేస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి

చందుర్తి, మే 16: గ్రామాల్లో ఆర్‌ఎంపీ, పీఎం పీలు కొవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ ఆన్నారు. మండలవలోని సనుగులలో ఆర్‌ఎంపీలు కొవిడ్‌ వైద్యం చేస్తున్నరనే సమా చారం మేరకు ఆదివారం క్లీనిక్‌ల తనిఖీ చేపట్టారు.   పరిధి దాటి ప్రథమ చికిత్స పేరుతో ఇతర వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మెడికల్‌ ప్రాక్టీషనర్లు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం నిర్వ హిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు.   కరోనా వైద్యం పేరుతో డబ్బులు వసూలు చేస్తు న్నట్లు తెలిసిందని, అనుమతి లేకుండా కరో నాకు వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.

మల్యాలలో పర్యటన

మండలోని మల్యాల గ్రామంలో బ్లాక్‌ ఫంగస్‌ సోకిదంటూ ప్రచారం జరగడంతో   జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు ఆది వారం గ్రామంలో పర్యటించారు.  బాధిత కు టుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిం చారు. పంటి నొప్పితో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లగా  బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానంతో హైదారాబా ద్‌లోని ఆస్పత్రికి తరలించారు.  


Updated Date - 2021-05-17T06:13:24+05:30 IST