CM YS Jagan తిరుమల పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
ABN , First Publish Date - 2021-10-05T12:19:46+05:30 IST
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న తిరుపతి,
తిరుపతి : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్నందున పటిష్ట బందోబస్తు చేపట్టామని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని పోలీసు సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన, భద్రత, బందోబస్తు అంశాలపై చర్చించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజున సీఎం రానుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతి, తిరుమలలో ముఖ్యమంత్రి పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయా ప్రదేశాలవద్ద నిరంతర గస్తీ, భద్రత ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తుగా చెక్పోస్టులను ఏర్పాటుచేయాలని సూచించారు. గరుడ కూడలి, అలిపిరి చెక్పాయింట్, తిరుమల కాలిబాట ప్రాంతాల్లో ప్రత్యేకదళాలతో గస్తీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.