అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై ఉగ్రవాద దాడిని ఖండించిన మోదీ
ABN , First Publish Date - 2021-11-14T02:09:10+05:30 IST
అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై ఉగ్రవాద దాడిని ఖండించిన మోదీ
న్యూఢిల్లీ: మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగం మరువలేనిదని మోదీ శనివారం అన్నారు. శనివారం మణిపూర్లోని చురచంద్పూర్ వద్ద కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈరోజు అమరవీరులైన సభ్యుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఆ సైనికులకు తాను నివాళులర్పిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.