షెల్టర్ హోంలో దారుణం..రిటైర్డు మహిళా ఎస్ఐపై ఇద్దరి అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-05-05T17:05:54+05:30 IST

దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన రైల్వే పోలీసు మాజీ మహిళా ఎస్ఐ (50)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ షెల్టర్ హోంలో జరిగింది....

షెల్టర్ హోంలో దారుణం..రిటైర్డు మహిళా ఎస్ఐపై ఇద్దరి అఘాయిత్యం

ఫిరోజ్‌పూర్ (పంజాబ్): దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల పంజాబ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన రైల్వే పోలీసు మాజీ మహిళా ఎస్ఐ (50)పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ షెల్టర్ హోంలో జరిగింది. రైల్వే పోలీసు అయిన భర్త మరణించడంతో కారుణ్యనియామకం కింద భార్యకు ఎస్ఐ పోస్టు వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహిళా ఎస్ఐ జమ్మూలోని వైష్ణోమాత దేవాలయం దర్శనం కోసం బయలుదేరి మార్గమధ్యంలో లాక్ డౌన్ వల్ల మధ్యలో చిక్కుకుపోయారు. తమ జీఆర్పీ పోలీసులు షెల్టరుహోంలో ఉంచగా, అక్కడ ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మహిళా మాజీ ఎస్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-05T17:05:54+05:30 IST