పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-01T05:49:23+05:30 IST
విద్యా ర్థులు ఒకలక్ష్యాన్ని ఎం చుకొని ఆ దిశగా కృషి పట్టుదలతో ముందుకు సాగుతూ దాన్ని సాధిం చుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఆదిలాబాద్టౌన్, నవంబరు 30: విద్యా ర్థులు ఒకలక్ష్యాన్ని ఎం చుకొని ఆ దిశగా కృషి పట్టుదలతో ముందుకు సాగుతూ దాన్ని సాధిం చుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్టార్స్ 50 ఆదిలాబాద్లో శిక్షణ పొంది ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీలలో శిక్షణ తీసుకున్న విద్యార్థులైన రమేష్, కళ్యాణి, చంద్రకాంత్,సుధాకర్, స్వప్న, అశోక్, రాజ్యలక్ష్మిలను సోమవారం కలెక్టర్ అభినందించారు. తన క్యాంపు కార్యాలయంలో కలిసిన వారితో కలెక్టర్ మాట్లాడారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, కోర్సు కో ఆర్డినేటర్ మారుతిశర్మ, టీటీడబ్లుఆర్ జేసీ ప్రిన్సిపల్ అగస్టిన్, వైటీసీలో విద్యార్థులను సన్మానించారు.