ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-02T05:11:51+05:30 IST
ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
వికారాబాద్ : శ్రద్ధగా చదువుకోవాలని కుటుంబీకులు మందలించడంతో విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. కొత్తగడి గ్రామానికి చెందిన శంకరయ్య, చంద్రకళ దంపతులకు అరుణ్, మహేందర్ ఇద్దరు కుమారులు. కాగా మహేందర్ 8వ తరగతి చదువుతున్నాడు. గత ఫిబ్రవరిలో శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందగా చంద్రకళ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. కాగా సోమవారం కుటుంబీకులు మహేందర్ (17)ను శ్రద్ధగా చదువుకోవాలని మందలించడంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.