ఇన్స్పైర్ అవార్డుకు కేశంపేట విద్యార్థిని
ABN , First Publish Date - 2021-01-17T04:48:37+05:30 IST
ఇన్స్పైర్ అవార్డుకు కేశంపేట విద్యార్థిని
కేశంపేట: ప్రతీ సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ అవార్డుకు కేశంపేట జడ్పీ పాఠశాల విద్యార్థిని మైత్రి ఎంపికైనట్టు హెచ్ఎం రసూల్ శనివారం తెలిపారు. 2019-20కి గాను రాష్ట్రస్థాయి పోటీలకు మైత్రి రూపొందించిన హోమ్ సెక్యూరిటీ డివైజ్ ఎంపికైందన్నారు. మైత్రికి ఫిజికల్ సైన్స్ టీచర్ మహేందర్రెడ్డి సహకారం అందించారన్నారు. ఆన్లైన్ ద్వార పోటీలు నిర్వహించారన్నారు. మైత్రికి సర్పంచ్ వెంకట్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ వెంకటయ్య, టీచర్లు అభినందనలు తెలిపారు.