ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట విద్యార్థిని

ABN , First Publish Date - 2021-01-17T04:48:37+05:30 IST

ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట విద్యార్థిని

ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట విద్యార్థిని

కేశంపేట: ప్రతీ సంవత్సరం నిర్వహించే రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డుకు కేశంపేట జడ్పీ పాఠశాల విద్యార్థిని మైత్రి ఎంపికైనట్టు హెచ్‌ఎం రసూల్‌ శనివారం తెలిపారు. 2019-20కి గాను రాష్ట్రస్థాయి పోటీలకు మైత్రి రూపొందించిన హోమ్‌ సెక్యూరిటీ డివైజ్‌ ఎంపికైందన్నారు. మైత్రికి ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ మహేందర్‌రెడ్డి సహకారం అందించారన్నారు. ఆన్‌లైన్‌ ద్వార పోటీలు నిర్వహించారన్నారు. మైత్రికి సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటయ్య, టీచర్లు అభినందనలు తెలిపారు.


Updated Date - 2021-01-17T04:48:37+05:30 IST