నీటి గుంతలో మునిగి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-01-17T04:45:31+05:30 IST

నీటి గుంతలో మునిగి విద్యార్థి మృతి

నీటి గుంతలో మునిగి విద్యార్థి మృతి

బొంరా్‌సపేట్‌: నీటి గుం తలో పడి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన బొంరా్‌సపేట్‌ మండలం బొట్లవాని తండాలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన రాహుల్‌ (18) శనివారం ఉదయం తన పొలానికి సమీపంలో తవ్విన చేపల గుంతలో పైపులను తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ఈత రాకపోవడంతో దానిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండా యువకులు అక్కడికి చేరుకోగా అప్పటికే రాహుల్‌ మృతి చెందాడు. మృతుడు రాహుల్‌ పరిగి పట్ట ణంలోని విజ్ఞాన్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Updated Date - 2021-01-17T04:45:31+05:30 IST