స్కూటర్ని సైకిల్ చేసి..వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-07-21T19:25:55+05:30 IST
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
కేరళ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేరళకు చెందిన మహమ్మద్ బాద్షా అనే ఇంటర్ చదువుతున్న యువకుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన సైకిల్కు బాజాజ్ పార్టులను తగిలించి పెట్రోల్, డీజీల్ ధరలకు వ్యతిరేకంగా కొచ్చి రోడ్లపై తిరుగుతూ నిరసన తెలిపాడు. అంతేకాదు బైస్కిల్, స్కూటర్ను కలిపి బజాకిల్ అని కూడా నామకరణం చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.