పాము కాటుతో విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2021-01-17T03:56:16+05:30 IST

మండల పరిధిలోని తిప్రస్‌పల్లిలో శనివారం పాముకా టుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందింది.

పాము కాటుతో విద్యార్థిని మృతి

ఊట్కూర్‌, జనవరి 16 : మండల పరిధిలోని తిప్రస్‌పల్లిలో శనివారం పాముకా టుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం దేవుడు నర్సప్ప, లక్ష్మి దంపతులకు అనురాధ ఏకైక సంతానం. ఊట్కూర్‌ కళాశా లలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. ప్రతీరోజు మాదిరిగానే రాత్రి తల్లీకూతురు భోజనం చేసి ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి అనురాధకు మేలుకు వ వచ్చి ఏదో కుట్టినట్లు తల్లికి తెలుపడంతో చుట్టు పక్కలవారి సాయంతో నారా యణపేట ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యుడు అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి నర్సప్ప 15 సంవత్స రాల క్రితం మృతి చెందగా, కూతురు మృతితో  తల్లి లక్ష్మి ఒంటరిగా మిగిలింది.  విద్యార్థిని కుటుంబాన్ని తప స్‌ నాయకులు  పరామర్శించారు.  

Updated Date - 2021-01-17T03:56:16+05:30 IST