ఎర్రగుంట్లలో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-10-18T05:45:04+05:30 IST

ఎర్రగుంట్ల- కడప రోడ్డులోని సుమోల స్టాండుకు సమీపంలో ఆదివారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో చప్పిడి చరణ్‌ తేజ్‌రెడ్డి(16) అనే డిప్లమో విద్యార్థి అక్క డికక్కడే మరణించాడు

ఎర్రగుంట్లలో విద్యార్థి మృతి
చరణ్‌తేజారెడ్డి మృతదేహం

ఎర్రగుంట్ల, అక్టోబరు 17: ఎర్రగుంట్ల- కడప రోడ్డులోని సుమోల స్టాండుకు సమీపంలో ఆదివారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో చప్పిడి చరణ్‌ తేజ్‌రెడ్డి(16) అనే డిప్లమో విద్యార్థి అక్క డికక్కడే మరణించాడు. వివరాల్లోకెళితే.... చరణ్‌తేజ్‌రెడ్డి కడప రోడ్డులోని ఇంటి నుంచి మోటార్‌సైకిల్‌ను తోసుకుంటూ వెళుతుండగా అదేవైపు నుంచి అతి వేగం గా వస్తున్న కేఏ01 ఏఎఫ్‌ 1599 నెంబరు గల లారీ ఢీకొంది. దీంతో వెనుకటైర్ల కింద ఇరుక్కుపోయిన చరణ్‌ను  అలాగే ఈడ్చుకెళుతుండగా స్థానికులు లారీని వెంబడించి ఆపారు. టైర్లకింద ఇరుక్కున్న చరణ్‌తేజ్‌ను బయటికి తీశారు. అప్పటికే కొన ఊపరితో ఉన్న చరణ్‌ మృతి చెందా డు. నాలుగురోడ్ల సమీపం కావడంతో వందలాదిమంది అక్కడికి చేరుకుని గుమి గూడారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వెంక టక్రిష్ణయ్య, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు రఘు, సుజాత, బంధువుల ఆర్తనాథాలు అందరినీ కంట తడిపెట్టిం చాయి. కాగా చరణ్‌తేజ్‌రెడ్డి మదనపల్లెలోని శ్రీవిద్యానికేతన్‌లో డిప్లమా సీఎస్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు. 

 

Updated Date - 2021-10-18T05:45:04+05:30 IST