స్కూళ్ల వద్ద విద్యార్థుల రద్దీ... పొంచివున్న కరోనా ముప్పు!
ABN , First Publish Date - 2020-08-12T12:08:23+05:30 IST
బీహార్లో కరోనావైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే మార్చి నుంచి పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేశారు. అయితే గత రెండు రోజులుగా ఆయా విద్యాసంస్థలకు...
పాట్నా: బీహార్లో కరోనావైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే మార్చి నుంచి పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేశారు. అయితే గత రెండు రోజులుగా ఆయా విద్యాసంస్థలకు ఒకేసారిగా వందలాది మంది విద్యార్థులు తరలివస్తున్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి మార్క్షీట్స్, సర్టిఫికేట్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్స్ తీసుకోవాలని విద్యాశాఖాధికారులు తెలియజేశారు. దీంతో పాస్అవుట్ విద్యార్థులు పాఠశాలలకు గుంపులు గుంపులుగా వస్తున్నారు. వారి మధ్య భౌతిక దూరం కూడా కనిపించడం లేదు. అలాగే కొంతమంది విద్యార్థులు ముఖానికి మాస్కులు కూడా ధరించడం లేదు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇటువంటి పరిస్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభలకుండా ఉండేందుకు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని వారు సూచిస్తున్నారు.