అనంతపురం జిల్లాలో జోగినీలుగా విద్యార్థులు?
ABN , First Publish Date - 2021-03-30T21:13:23+05:30 IST
జిల్లాలో జోగినీలుగా విద్యార్థులు మారుతున్నారా? దీనికి అవుననే సమాధానం వస్తున్నది. తాజాగా
అనంతపురం: జిల్లాలో జోగినీలుగా విద్యార్థులు మారుతున్నారా? దీనికి అవుననే సమాధానం వస్తున్నది. తాజాగా ఇద్దరు విద్యార్థినులను జోగినిలుగా మార్చే యత్నం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించి ఈ దురాచారాన్ని అడ్డుకున్నారు. బొమ్మనహల్ మండలంలోని కలహాల్ గ్రామంలో ఓ విద్యార్థినిని 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిని జోగినిగా మార్చే ప్రయత్నం ఆ బాలిక తల్లి చేసింది. అయితే గ్రామస్థులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్, ఐసీడీఎస్, ఇతర శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఆ బాలిక తల్లి, కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ బాలికను కేజీబీవీ పాఠశాలలో అధికారులు చేర్పించారు.
అలాగే డి.హీరేహాల్ మండలం సోములాపురం గ్రామంలో చిన్నారి(6)ని జోగినిగా మార్చే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు.