బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ABN , First Publish Date - 2022-09-07T06:12:38+05:30 IST

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం వీర్నపల్లి-వన్‌పల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సై అపూర్వరెడ్డి

 వీర్నపల్లి, సెప్టెంబరు 6 : ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని  ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం వీర్నపల్లి-వన్‌పల్లి ప్రధాన రహదారిపై  విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పేద విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. అడవిపదిరలోకి బస్సు రాక కిలోమీటర్ల మేర  నడుస్తూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలోకి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.  అనంతరం ఎస్సై అపూర్వరెడ్డి ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.   కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విష్ణువర్ధన్‌, భూమరాజు, ప్రసాద్‌, మధుకర్‌, మహేష్‌, జాషువా, బాలకిషన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-07T06:12:38+05:30 IST