విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారు: మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-10-03T23:19:44+05:30 IST

రాష్ట్రంలో సైనిక పాలన గుర్తుచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ దుయ్యబట్టారు.

విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారు: మధుయాష్కీ

హైదరాబాద్: రాష్ట్రంలో సైనిక పాలన గుర్తుచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు విద్యను దూరం చేసి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అత్యంత సున్నితమైన చార్మినార్ దగ్గర బీజేపీ సభకు అనుమతిచ్చారని, కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలీకి ఎందుకు అనుమతివ్వలేదు? అని ప్రశ్నించారు. అమరులకు నివాళులర్పిస్తామంటే సీఎం కేసీఆర్‌కు వణుకెందుకు అని నిలదీశారు. విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారని మధుయాష్కీ మండిపడ్డారు.

Updated Date - 2021-10-03T23:19:44+05:30 IST