హిజాబ్ తొలగించిన విద్యార్థినులు
ABN , First Publish Date - 2022-02-20T16:57:13+05:30 IST
రాష్ట్రంలో హిజాబ్, కాషాయ వస్త్రాల వివాదం జరుగుతున్న వేళ వివాదానికి అతీతంగా రాయచూరుకు చెందిన పలువురు ముస్లిం విద్యార్థినులు ఆదర్శాన్ని చాటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలో హిజాబ్, కాషాయ వస్త్రాల వివాదం జరుగుతున్న వేళ వివాదానికి అతీతంగా రాయచూరుకు చెందిన పలువురు ముస్లిం విద్యార్థినులు ఆదర్శాన్ని చాటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు శనివారం అధికారులు సూచించిన విధంగా హిజాబ్లను తొలగించి సాధారణ యూనిఫాంతో తరగతులకు హాజరయ్యారు. ఇంటి నుంచి హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులకు దాన్ని తొలగించేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయగా అత్యధిక శాతం మంది విద్యార్థినులు ఆ అవకాశాన్ని వినియోగించుకోగా మరికొంత మంది విద్యార్థినులు మాత్రం తాము హిజాబ్ తొలగించేది లేదంటూ కళాశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.