విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2021-06-22T06:26:45+05:30 IST

విద్యార్థులు చదువుల్లో రాణించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని డీఆర్‌ఎం అలోక్‌ తి వారి పేర్కొన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: డీఆర్‌ఎం
ఇండోర్‌ గేమ్స్‌ను ప్రారంభిస్తున్న డీఆర్‌ఎం తివారి

గుంతకల్లు, జూన21: విద్యార్థులు చదువుల్లో రాణించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని డీఆర్‌ఎం అలోక్‌ తి వారి పేర్కొన్నారు. సోమవారం  స్థానిక రైల్వే ఉన్నత పాఠశాల లో ఇండోర్‌ గేమ్స్‌ను డీఆర్‌ఎం తో పాటు ఆయన సతీమణి రై ల్వే ఉమెన వెల్ఫేర్‌ ఆర్గనైజేషన అధ్యక్షురాలు నీతి తివారి ప్రారంభించారు. ఈ సందర్భం గా డీఆర్‌ఎం మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులకు టేబుల్‌ టెన్నిస్‌, క్యా రంబోర్డు, చెస్‌ తదితర 10 రకాల ఇండోర్‌ గేమ్స్‌ను నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచఎం మధుసూదన రావు తెలిపారు. 20 రోజులపాటు పోటీలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం మురళీకృష్ణ, ఆయన సతీమణి గంగా భవాని, ఏడీఎ్‌ఫఎం విజయనా థ్‌, సీనియర్‌ డీపీఓ మురళీధరన, ఏడీఈఈ దేవరబాబు, విశ్రాంత ఏడీఈఎన (పవర్‌) రామాంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:26:45+05:30 IST