విద్యార్థులకు అవగాహన అవసరం
ABN , First Publish Date - 2020-03-04T07:45:29+05:30 IST
ఓఎంఆర్ పత్రాన్ని ఉపయోగించి పరీక్షలు రాయటం విద్యార్థులకు పదో తరగతి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో పేపర్ మోడల్ మారటం, బిట్ పేపరు రద్దు..
ఓఎంఆర్ పత్రాన్ని ఉపయోగించి పరీక్షలు రాయటం విద్యార్థులకు పదో తరగతి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో పేపర్ మోడల్ మారటం, బిట్ పేపరు రద్దు అవటం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల వల్ల విద్యార్థులు కొంత అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు మారిన అంశాలపైనే కాకుండా, ఓఎమ్మార్ షీట్ను ఉపయోగించటం వంటి వాటిపై అవగాహన తరగతులు నిర్వహించాలి. పాఠశాల స్థాయిలో డమ్మీ షీట్తో శిక్షణ ఇవ్వాలి.
ఉప్పలపు శేషునాథ్, పి. నైనవరం