దూరదర్శన్‌ పాఠాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-04-09T11:50:14+05:30 IST

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దూరదర్శన్‌లో సప్తగిరి, విద్యాశాఖ, సంక్షేమ పాఠశాలల ఆ

దూరదర్శన్‌ పాఠాలను  విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ఒంగోలువిద్య, ఏప్రిల్‌ 8 : పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దూరదర్శన్‌లో సప్తగిరి, విద్యాశాఖ, సంక్షేమ పాఠశాలల ఆ ధ్వర్యంలో బుధవారం నుంచి ప్రసారం అవుతున్న పాఠాలను సద్విని యో గం చేసుకోవాలని ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, కేజీ బీవీ, ఆదర్శ పాఠశాలల కార్యదర్శి డాక్టర్‌ ఎంఆర్‌.ప్రసన్న కుమార్‌ బుధవారం ప్రకటనలో కోరారు.


విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాఽధ్యాయులు, ప్రధానా చార్యులు, ప్రత్యేకాధికారులు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల న్నారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5గంటలవరకు పాఠాలు ప్రసారమవుతాయని తెలిపారు. ప్రసార మయ్యే సబ్జెక్టు వివరాలు.. సోమవారం గణితం, హిందీ, సోషల్‌స్టడీస్‌, మంగళవారం సైన్సు(పీఎస్‌,ఎన్‌ఎస్‌), తెలుగు, ఇంగ్లీషు, అలాగే బుధవా రం గణితం, హిందీ, సోషల్‌స్టడీస్‌, గురువా రం సైన్సు, తెలుగు, ఇంగ్లీషుల ను బోధిస్తారు. శుక్రవారం హిందీ, సోషల్‌ స్టడీస్‌, శనివారం సైన్సు, తెలు గు, ఇంగ్లీషు పాఠాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

Updated Date - 2020-04-09T11:50:14+05:30 IST