నాకు మతిస్థిమితం లేదని ఒక్క వైసీపీ ఎమ్మెల్యేతోనైనా చెప్పించండి..: సుబ్బారావు గుప్తా
ABN , First Publish Date - 2022-01-04T20:23:23+05:30 IST
తనను బతికించింది పత్రిక మీడియా మిత్రులేనని వారికి పాదాభివందనమని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా అన్నారు.
విజయవాడ: ఆర్యవైశ్యులు ఎవరికీ భయపడరని సుబ్బారావు గుప్తా అన్నారు. మంగళవారం ఆర్యవైశ్య ఐక్యత సభలో సుబ్బారావు గుప్తా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ..‘‘ నా ఇంటిపై జరిగిన దాడి విషయంలో కార్ నెంబర్తో సహా పూర్తి ఆధారాలను పోలీసులకు ఇచ్చా. నాపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నాకు మతిస్థిమితం లేదని ఒక్క వైసీపీ ఎమ్మెల్యేతోనైనా చెప్పించండి.ఈ రోజు నేనే వంగవీటి రాధను కలిశా.వంగవీటి రంగా బతికి ఉంటే సీఎం అయ్యేవారు.తనను బతికించింది పత్రిక మీడియా మిత్రులేనని వారికి పాదాభివందనం. నా మీద దాడి జరిగింది. నన్ను పోలీస్ ల సహాయంతోనే వాళ్లు గుంటూరులో ఉన్నట్టు గుర్తించారు’’ అని సుబ్బారావు గుప్తా తెలిపారు.
‘‘సుభాని అప్పులు పాలు అయ్యాడు అవి తీర్చుకోవడానికి నన్ను కొట్టాడు. మీరు మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సామంత రాజులు వచ్చారు. చిత్తూరులో మీ సామాజిక వర్గం వాళ్లనే కొట్టారు... సిగ్గు చేటు.కొట్టించుకున్న నేను హీరో అయ్యాను కొట్టిన వాడు విలన్ అయ్యాడు. నన్ను కొట్టిన వాడిని కఠినంగా శిక్షించాలి. రాధ బాబును కలిశా.. ఆయనకు నలుగురు గన్మెన్లు ఇచ్చారు ఆయన వెనెక్కి పంపారు. నాకు గన్మెన్ ఇవ్వమన్న ఇవ్వలేదు. ఏ కులం పైన దాడి జరిగినా నేను ముందు ఉండి పోరాడుతా. భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదు’’ అని సుబ్బారావు గుప్తా అన్నారు.