దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ విచారణ

ABN , First Publish Date - 2021-11-27T06:11:57+05:30 IST

మండలంలోని లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజం నాయుడుపై జరిగిన భౌతిక దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ విచారణ చేపట్టారు.

దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ విచారణ
టీచర్లతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌

 


చింతపల్లి, నవంబరు 26: మండలంలోని లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజం నాయుడుపై జరిగిన భౌతిక దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ విచారణ చేపట్టారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాలను సందర్శించి, ఉపాధ్యాయులు, హెచ్‌ఎంతో మాట్లాడారు. దాడి జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. ఈ దాడిపై విచారణ చేపట్టాలని అన్నవరం ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్‌ని ఆదేశించారు. ఈ విచారణలో చింతపల్లి తహసీల్దార్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T06:11:57+05:30 IST