గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-18T05:13:37+05:30 IST

రాజంపేట మండలంలోని బియ్యం, మద్యం షాపుల నిల్వల గోడోన్లను సోమవారం సాయంత్రం సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ల స్టాక్‌పాయింట్లలో స్టాక్‌ ఎంత మేర నిల్వ ఉంది, ఎంత మేర పంపిణీ చేశారనే

గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌
లిక్కర్‌ గోడౌన్‌ను తనిఖీ చేస్తున్న సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట, జనవరి 17 : రాజంపేట మండలంలోని బియ్యం, మద్యం షాపుల నిల్వల గోడోన్లను సోమవారం సాయంత్రం సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ల స్టాక్‌పాయింట్లలో స్టాక్‌ ఎంత మేర నిల్వ ఉంది, ఎంత మేర పంపిణీ చేశారనే విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడోన్లలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్ధేశించిన డీలర్లకు నిర్ధేశిత మోతాదు స్టాకు అందివ్వాలని ఆయన సూచించారు. ఈ విషయంలో   అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని, అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత యజమానులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దా రు రవిశంకర్‌రెడ్డి, ఎక్సైజ్‌ ఎస్‌ఐ సుధాకర్‌, సీఎస్‌డీటీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:13:37+05:30 IST