Subendu adhikari : దీదీని అక్కడ కూడా ఓడించితీరుతా

ABN , First Publish Date - 2021-09-06T23:25:52+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో అందరి దృష్టీ భవానీపూర్ నియోజకవర్గంపై పడింది. ఉప ఎన్నికల సందర్భంగా

Subendu adhikari : దీదీని అక్కడ కూడా ఓడించితీరుతా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అందరి దృష్టీ  భవానీపూర్ నియోజకవర్గంపై పడింది. ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే తాజాగా ఆమె ప్రత్యర్థి, నందిగ్రామ్ ఎమ్మెల్యే సుబేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఆదేశిస్తే తాను భవానీపూర్ నుంచి మమతపై పోటీకి దిగుతానని సంచలన ప్రకటన చేశారు. దీంతో అందరి దృష్టీ భవానీపూర్‌పై పడింది. ‘‘నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగాలని మమతకు ఎవరు చెప్పారు? పార్టీ గనక నన్ను భవానీపూర్ నుంచి బరిలోకి దిగమని చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా... నందిగ్రామ్‌లోనే ఆమెను 1956 ఓట్ల తేడాతో ఓడించాను’’ అని సుబేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. 


Updated Date - 2021-09-06T23:25:52+05:30 IST