తూతూ మంత్రంగా సుభానీ అరెస్ట్.. స్టేషన్ బెయిల్

ABN , First Publish Date - 2021-12-22T19:17:00+05:30 IST

సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలో డ్యామెజ్ కంట్రోల్ చేసేందుకు మంత్రి బాలినేని ప్రయత్నించారు.

తూతూ మంత్రంగా సుభానీ అరెస్ట్.. స్టేషన్ బెయిల్

ప్రకాశం జిల్లా: వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలో డ్యామెజ్ కంట్రోల్ చేసేందుకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రయత్నించారు. అందులో భాగంగానే సుభానీని అరెస్టు చేసినట్లు సమాచారం. కేసు విచారణలో సుభానీని అదుపులోకి తీసుకున్నామని, సైదాను కూడా అదుపులోకి తీసుకుంటామని వన్ టౌన్ సీఐ తెలిపారు. ఇంత జరిగినా సుభానీపై పోలీసులు బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు. ఏడేళ్లలోపు శిక్షలు పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో సుభానీకి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Updated Date - 2021-12-22T19:17:00+05:30 IST