సబ్జైల్ను సందర్శించిన జడ్జి
ABN , First Publish Date - 2021-04-18T05:16:21+05:30 IST
మధిర సబ్జైల్ను శనివారం జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ సందర్శించారు.
మధిర, ఏప్రిల్ 17: మధిర సబ్జైల్ను శనివారం జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ సందర్శించారు. సాధారణ తనిఖీల్లో బాగంగా ఆయన జైలును సందర్శించి జుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. వారిపై ఉన్న కేసులు వివరాలు బెయిల్కు సంబంధించిన పిటీషన్లు వేసుకున్నారా, లేదా, అనే అంశాలతోపాటు వారికి అందుతున్న ఆహారం, మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను, వంటశాలను, ఖైదీలకు పెడుతున్న ఆహార పదార్దాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ ప్రభాకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.