రజినీకాంత్ పార్టీపై ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-12-04T01:03:13+05:30 IST

సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ పార్టీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు రజినీ చేసిన ప్రకటనపై...

రజినీకాంత్ పార్టీపై ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆసక్తికర ట్వీట్

చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ పార్టీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు రజినీ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. రజినీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా.. రారా అన్న సందేహాలకు తాజా ప్రకటనతో తెరపడిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో రజినీకాంత్, శశికళ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేయడం విశేషం. రజినీ తాజా నిర్ణయంతో బీజేపీ డైలమాలో పడిందని ఆయన ట్వీట్ చేశారు. తన రాజకీయ పార్టీపై రజినీ తాజాగా చేసిన ట్వీట్ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


జనవరిలో ఆవిర్భవించబోతున్న తన పార్టీకి సంబంధించి డిసెంబర్ 31న ప్రకటన చేయనున్నట్లు రజినీకాంత్ ట్వీట్ చేయడంతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీకి రజినీ సిద్ధమైనట్లు ఈ ట్వీట్‌తో స్పష్టం కావడంతో ఆయన స్థాపించబోయే రాజకీయ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, పొత్తులు.. ఇలా పలు అంశాలు ఆయన పార్టీకి సంబంధించి చర్చకొస్తున్నాయి. ఆధ్యాత్మిక రాజకీయ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న రజినీకాంత్ బీజేపీతో కలిసి ముందుకెళతారని, ఆయన ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉందని.. ఇలా భిన్న వాదనలు తెరపైకొచ్చాయి.



Updated Date - 2020-12-04T01:03:13+05:30 IST