‘ఆయన్ను మారిస్తే కర్ణాటకలో బీజేపీకి కష్టమే’

ABN , First Publish Date - 2021-07-22T17:09:16+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పుపై బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ఘాటుగా స్పందించారు. యడియూరప్పను మారిస్తే కర్ణాటకలో బీజేపీకి కష్టమేనని అధిష్ఠానాన్ని హెచ్చ

‘ఆయన్ను మారిస్తే కర్ణాటకలో బీజేపీకి కష్టమే’

            - సుబ్రహ్మణ్యస్వామి 


బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పుపై బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ఘాటుగా స్పందించారు. యడియూరప్పను మారిస్తే కర్ణాటకలో బీజేపీకి కష్టమేనని అధిష్ఠానాన్ని హెచ్చరించేలా ట్వీట్‌ చేశారు. తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామికి కర్ణాటక బీజేపీపై దశాబ్దాలకాలంగా పట్టు ఉంది. కర్ణాటకలో సీఎం మార్పు అంశం దేశమంతటా చర్చకు తెరలేవగా సుబ్రహ్మణ్యస్వామి బుధవారం స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన తొలి వ్యక్తి యడియూరప్ప అన్నారు. ఆయన సత్తా కలిగిన నేత అని పేర్కొన్నారు. ఆయన లేనందుకే 2013లో అధికారం దక్కలేదని మరోసారి అదే తప్పిదం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 

Updated Date - 2021-07-22T17:09:16+05:30 IST