అన్నా.. నమస్తే..!
ABN , First Publish Date - 2020-09-24T09:10:24+05:30 IST
ఎమ్మెస్ ధోనీతో కలిసి ఆడడమనేది భారత యువ క్రికెటర్ల కల. అది నెరవేరితే తమ జన్మధన్యమైనట్టు భావిస్తారు...
షార్జా: ఎమ్మెస్ ధోనీతో కలిసి ఆడడమనేది భారత యువ క్రికెటర్ల కల. అది నెరవేరితే తమ జన్మధన్యమైనట్టు భావిస్తారు. మహీకున్న క్రేజ్ అలాంటిది. మంగళవారంనాటి మ్యాచ్తో ఐపీఎల్లో తొలిమ్యాచ్ ఆడిన 18 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ మైదానంలో మహీని చూడగానే ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ధోనీకి దగ్గరకు వెళ్లేందుకు తటపటాయించిన అతడు.. రెండు చేతులు జోడించి మహీకి నమస్కరించడం టీవీ కెమెరాలకు చిక్కింది.