రొడామిస్త్రీనగర్‌లో షెడ్డు కూల్చివేత

ABN , First Publish Date - 2021-04-18T07:07:32+05:30 IST

రొడామిస్త్రీనగర్‌ ఏలోని సర్వే నెం బర్‌ 220లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నిర్మిస్తున్న షెడ్డును గాజులరామారం టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం కూల్చివేశారు.

రొడామిస్త్రీనగర్‌లో షెడ్డు కూల్చివేత

 ఆత్మహత్యకు యత్నించిన నిర్మాణదారుడు


జీడిమెట్ల, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రొడామిస్త్రీనగర్‌ ఏలోని సర్వే నెం బర్‌ 220లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నిర్మిస్తున్న షెడ్డును గాజులరామారం టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం కూల్చివేశారు. అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి అధికారులపై దాడికి యత్నించి, సిలిండర్‌ తీసుకుని గ్యాస్‌ వదిలి ఆత్మహత్యాయతాన్నికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి కట్టెలమండి పేరుతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పర్మినెంట్‌ షెడ్డును నిర్మించడంతో స్థానికులు టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా శనివారం కూల్చివేశారు. అధికారులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-18T07:07:32+05:30 IST