ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-14T05:39:26+05:30 IST
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వీరులపాడు, మే 13: మండలంలోని జుజ్జూరులో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో భార్య పుట్టింటికి వెళ్లగా, ఇంట్లో ఎవరు లేని సమయంలో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. గ్రామానికి చెందిన చల్లా గోపీ అదే గ్రామానికి చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులుగా భార్యభర్తల మధ్య వివాదం తలెత్తుతోంది. దాంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోపీ ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తలుపు తీయకపోవటంతో స్థానికులు గుర్తించి తలుపులు పగులకొట్టారు. ఫ్యాన్కు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై మణికుమార్ మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.