పెట్రోల్‌తో నిప్పంటించుకుని భర్త మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:39:51+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభ ర్తలు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సోమశిలలో జరిగింది. ఈ ఘటనలో భర్త గుమ్మడి శ్రీకాంత్‌ (26) మృతిచెందగా

పెట్రోల్‌తో నిప్పంటించుకుని భర్త మృతి

  తట్టుకోలేక భార్య ఆత్మహత్యాయత్నం

అనంతసాగరం, మే 16: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభ ర్తలు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన సోమశిలలో జరిగింది. ఈ ఘటనలో భర్త గుమ్మడి శ్రీకాంత్‌ (26) మృతిచెందగా భార్య కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోమశిల ఎస్సీ కాలనీకి చెందిన గుమ్మడి శ్రీకాంత్‌ నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన కవిత అనే యువతిని ఆరునెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపు రం కొంతకాలం సజావుగా సాగింది. శ్రీకాంత్‌కు ఉద్యోగం లేకపోవడం, ఇతర కారణాల నేపథ్యంలో కుటుంబకలహాలు మొదలయ్యాయి. దీం తో తరచూ వారి మధ్య గొడవ జరిగేది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇంటి నుంచి శ్రీకాంత్‌ వెళ్లిపోయి గ్రామ సమీపంలో తన బైక్‌ నుంచి పెట్రోల్‌ తీసి ఒం టిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలియజే యడంతో  వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం శ్రీకాంత్‌ మృతి చెందాడు. భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య కవిత ఇంట్లో ఉన్న శానిటైజర్‌ తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గూడూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సోమశిల ఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T04:39:51+05:30 IST