దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-03-08T06:48:49+05:30 IST

సంతానానికి భారం కావడం ఇష్టం లేక, ఆర్థిక బాధలు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన ఇది.

దంపతుల ఆత్మహత్యాయత్నం

వృద్ధురాలి మృతి 

కోలుకుంటున్న వృద్ధుడు

ముదినేపల్లి, మార్చి 7 : సంతానానికి భారం కావడం ఇష్టం లేక, ఆర్థిక బాధలు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన  వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన ఇది. ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన పిచ్చేటి సత్యనారాయణ (70), ధనలక్ష్మి (62) దంపతులు వృద్ధాప్యంతో   కుమారుడి వద్దే జీవనం సాగిస్తున్నారు. ధనలక్ష్మి అనారోగ్యం పాలయింది. కూలి పనులు చేస్తూ కుమారుడే పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు కుమారుడికి భారం అయ్యామని భావించారు కాబోలు శనివారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన కుమారుడు తల్లిదండ్రులు పురుగు మందు తాగినట్లు గమనించి వెంటనే 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు పరిస్ధితి విషమంగా ఉండటంతో బందరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక ధనలక్ష్మి మరణించగా ఆమె భర్త సత్యనారాయణ కోలుకుంటున్నారు.  ఎస్సై ఎ.మణికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-03-08T06:48:49+05:30 IST