AP: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-16T12:01:35+05:30 IST

భర్త వేధింపులు భరించలేక ఒక మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన కొక్కిరగడ్డ ఆశాజ్యోతి (30)కి కృష్ణా జిల్లా ముసునూరు

AP: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య

పశ్చిమ గోదావరి/ఏలూరు: భర్త వేధింపులు భరించలేక ఒక మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన కొక్కిరగడ్డ ఆశాజ్యోతి (30)కి కృష్ణా జిల్లా ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన రవికుమార్‌తో ఐదున్నర ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. ఆశాజ్యోతి బీఎస్సీ నర్సింగ్‌ చదివి ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసింది. కొవిడ్‌ సమయంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేసింది.  భర్త వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం టుటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌కు అందడంతో ఎస్‌ఐ కిశోర్‌బాబు సిబ్బందితో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-11-16T12:01:35+05:30 IST