సుడాన్లో హింస.. 83 మంది మృతి
ABN , First Publish Date - 2021-01-18T07:22:39+05:30 IST
సుడాన్లోని వెస్ట్ డార ్ఫర్ ప్రావిన్స్లో గిరిజన తెగలకు చెందిన అరబ్స్-నాన్ అరబ్స్కు మధ్య హింస చెలరే గుతోంది.
కైరో, జనవరి 17: సుడాన్లోని వెస్ట్ డార ్ఫర్ ప్రావిన్స్లో గిరిజన తెగలకు చెందిన అరబ్స్-నాన్ అరబ్స్కు మధ్య హింస చెలరేగుతోంది. ఈ ఘర్షణల్లో 83 మంది మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెప్పారు. జెనీనాలోని ఓ శిబిరంలో వలస వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మధ్య శుక్రవారం చెలరేగిన గొడవే ఇరు వర్గాల మధ్య హింసకు దారి తీసింది. ఇది శని, ఆదివారాలూ కొనసాగింది.