రైతులు, రైతు కూలీలు.. 200 రోజులుగా దీక్ష చేస్తున్నారు: సుధాకర్‌రావు

ABN , First Publish Date - 2020-07-02T17:12:05+05:30 IST

అమరావతి: రైతులు, రైతు కూలీలు, మహిళలు ధర్నాలు, దీక్షలు 200 రోజులుగా చేసున్నారని అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు.

రైతులు, రైతు కూలీలు.. 200 రోజులుగా దీక్ష చేస్తున్నారు: సుధాకర్‌రావు

అమరావతి: రైతులు, రైతు కూలీలు, మహిళలు ధర్నాలు, దీక్షలు 200 రోజులుగా చేసున్నారని అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు. ఉద్యమంలో 68 వరకు మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కాబట్టి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలన్నారు. రాష్ట్రంలో 82 శాతం ప్రజలు అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. జులై 4 న 200 నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారని సుధాకర్ పేర్కొన్నారు. జులై 4న అమరావతికి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల నేతలు కూడా జూమ్ ద్వారా... రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారని సుధాకర్ పేర్కొన్నారు.


Updated Date - 2020-07-02T17:12:05+05:30 IST