సూచించిన పంటలే సాగు చేయాలి

ABN , First Publish Date - 2020-05-27T10:44:31+05:30 IST

ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. నియంత్రిత సాగుపై

సూచించిన పంటలే సాగు చేయాలి

అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం


ఇటిక్యాల మే 26 : ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. నియంత్రిత సాగుపై మండలంలోని మునుగాల, కొండేరు గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వానాకాలంలో మొక్కజొన్నను సాగు చేయొద్దని, వ్యవసాయశాఖ సూచించిన పంటలు వరి, కంది, పత్తి మాత్రమే వేసుకోవాలని సూచించారు. పంటల సాగుపై వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవిందునాయక్‌ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ధర్మవరం రంగారెడ్డి, జడ్పీటీసీ హనుమంతురెడ్డి, రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు గిడ్డారెడ్డి, సర్పంచు వీరన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:44:31+05:30 IST