జీవితంపై విరక్తితో..
ABN , First Publish Date - 2021-05-11T06:25:20+05:30 IST
జీవితంపై విరక్తితో..
పురుగుల మందు తాగి తండ్రి, కూతురు ఆత్మహత్య
ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో ఘటన
ఐనవోలు, మే 10 : అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తిచెందిన తండ్రీ, కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లిలో ఆదివారం రాత్రి ఈ విషాదం జరి గింది. ఎస్సై భరత్ వివరాల మేరకు.. ఒం టిమామిడిపల్లికి చెందిన కడుదూరి సంపత్(55) భార్య ఐదు సంవత్సరాల కిత్రం మృ తి చెందింది. వీరికి కుమారుడు సంతోష్, కూతురు హేమ ఉన్నారు. కొంత కాలంగా సంపత్ అనారోగ్యం బారినపడి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఆయన కూతురు హేమ (34)కు 11 సంవత్సరాల క్రితం వివాహం చేయగా పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన ఆమె పుట్టింట్లోనే ఉంటోం ది. ఆదివారం సంతోష్ తన భార్యతో కలిసి అత్తగారని ఊరికి వెళ్లారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన సంపత్ ఆది వారం రాత్రి 10 గంటలకు మంచానికే పరిమితమైన తన కూ తురు హేమకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగాడు. ఈ విషయాన్ని సంతోష్కు ఫోన్ చేసి చెప్పాడు. సంతోష్ వెంటనే గ్రామంలోని బంధువులకు సమాచారం ఇవ్వగా ఎంజీ ఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉద యం 15 నిమిషాల వ్యవధిలోని ఇద్దరూ మృతిచెందారు. సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.