వైసీపీ కార్యకర్త వేధింపులకు యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-05-11T05:54:31+05:30 IST

అధికారపార్టీ వైసీపీ కార్యకర్త వేధింపులు తాళలేక యువకుడు జాకీర్‌షరీఫ్‌ విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం సాయం త్రం పామిడి పట్టణంలో చోటుచేసుకుంది.

వైసీపీ కార్యకర్త వేధింపులకు యువకుడి ఆత్మహత్యాయత్నం

పామిడి, మే 10: అధికారపార్టీ వైసీపీ కార్యకర్త వేధింపులు తాళలేక యువకుడు జాకీర్‌షరీఫ్‌ విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం సాయం త్రం పామిడి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు సమాచా రం మేరకు, పట్టణంలోని ఆముదాలవీధిలో నివాసముంటున్న జాకీర్‌షరీఫ్‌ ఎలకి్ట్రకల్‌ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త బషీర్‌ కొంతకాలం గా వైసీపీ కార్యకర్తను అంటూ వేధిస్తున్నాడు. దీంతో విసిగిపో యి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స మాచారం.


 ‘వైసీపీ కార్యకర్తలం అని, వైఎ్‌సఆర్‌ పేరు చెప్పుకొని మాలాంటి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వైఎ్‌సఆర్‌ పేరు నాశనం చేస్తున్నారు. ఇలాంటి వారి మీద కటినంగా చర్య తీసుకొని కోర్టుకి వేసి శిక్షిస్తారని నా చివరి కోరిక’ అంటూ సీఐకు రాసిన లేఖ లభ్యమైంది. బాధిత యువకుడు అనంతపురంలో ని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై సీఐ శ్యా మరావును అడుగగా ఓ యువకుడు వైసీపీ కార్యకర్త వేధింపులతో ఆత్మహత్యాయత్నానికిు పాల్పడినట్లు సమాచారం తెలిసింది. ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-05-11T05:54:31+05:30 IST