భూ వివాదంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-03-20T21:09:18+05:30 IST
భూ వివాదాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్: భూ వివాదాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట శ్రీకాంత్ అనే యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంచేశాడు. భూ వివాదానికి సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు తన దగ్గర నుంచి లాక్కుంటారన్న భయంతోనే శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఘటన మండలంలో సంచలనం రేపింది.