గౌరవెల్లి నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-12-25T22:52:59+05:30 IST
గౌరవెల్లి నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కన్నపేట
సిద్దిపేట: గౌరవెల్లి నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కన్నపేట మండలం తిరుమల తండాకు చెందిన వాoకుడోతు దాస్య నాయక్కు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకు ఉన్న మూడు ఇళ్లను గౌరవెల్లి ప్రాజెక్ట్లో కోల్పోయాడు. అయితే ఇంతవరకు తనకు ఎలాంటి పరిహారం రాలేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తీవ్ర నిరాశకు లోనై గౌరవెళ్లి ప్రాజెక్టు కట్ట వద్ద దాస్య నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నాన్ని స్థానికులు, నిర్వాసితులు అడ్డుకున్నారు.