పచ్చలనడ్కుడలో నవ వరుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-22T05:39:20+05:30 IST

ఇష్టం లేని పెళ్లి చేశారంటూ నవ వరుడు ఆత్మహత్యకు యత్నించడమే కాకుండా తన భార్య తోనూ పురుగుల మందు తాగించిన ఘటన వేల్పూర్‌ మం డలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

పచ్చలనడ్కుడలో నవ వరుడి ఆత్మహత్యాయత్నం
భీమయ్య, స్వాతి పెళ్లి నాటి ఫొటో

భార్యతోనూ పురుగుల మందు తాగించిన ఘనుడు
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందు వల్లే..
వరుడి పరిస్థితి విషమం

వేల్పూర్‌, జూన్‌ 21 : ఇష్టం లేని పెళ్లి చేశారంటూ నవ వరుడు ఆత్మహత్యకు యత్నించడమే కాకుండా తన భార్య తోనూ పురుగుల మందు తాగించిన ఘటన వేల్పూర్‌ మం డలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన శారదకల్ల గంగాధర్‌, మల్లక్క దంపతుల రెండో కు మారుడు భీమయ్యకు.. మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌ గ్రామానికి చెందిన స్వాతితో ఈనెల 13వ తేదీన వివాహం జరిగింది. అయితే, భీమయ్య తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇందు లో భాగంగానే ఆదివారం అర్ధరాత్రి భీమయ్య తీవ్ర మనస్తా పంతో గదిలోనే పురుగుల మందు తాగాడు. విషయం చెప్పకుండా తన భార్య స్వాతితోనూ కొద్దిమోతాదులో ఉన్న పురుగుల మందును తాగించాడు. తర్వాత భీ మయ్య తన ప్రేమ వ్యవహారం.. పురుగుల మందు వి షయాన్ని భార్య స్వాతికి చెప్పా డు. దీంతో.. ఆమె ఒక్కసారి భయా ందోళనకు గురైంది. వెంటనే విషయాన్ని స్వాతి తన అత్తతో చెప్పింది. దీంతో ఇద్దరినీ నిజామాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఇందులో వరుడు భీమయ్య పరిస్థితి విష మంగా ఉండగా.. స్వాతి కోలుకుంది. కాగా.. స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వేల్పూర్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-06-22T05:39:20+05:30 IST