జీవితంపై విరక్తితో చేతులు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-05T04:04:52+05:30 IST

జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి తన చేతులు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామంలో చోటు చేసుకుంది.

జీవితంపై విరక్తితో చేతులు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి: జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి తన చేతులు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. షేక్ అన్వర్ బాషా(55) భార్య మృతి చెందింది. అతని కుటుంబ సభ్యులు కూడా వదిలేయడంతో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. అయితే ఒంటరి తనంతో పాటు అనారోగ్యానికి గురికావడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో అన్వర్ బాషా తన చేతులను బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఉంటున్న గది అంతా రక్తసిక్తం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-05T04:04:52+05:30 IST