కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-24T04:50:09+05:30 IST
రాయచోటి మున్సిపాలిటీ పెద్దకాల్వపల్లెకు చెందిన ఆంజనేయులు (46) వ్యక్తిగత సమస్యలతో తన ఇంటిలో బుధవారం ఉరి వేసుకున్నాడు.
రాయచోటి, జూన్ 23: రాయచోటి మున్సిపాలిటీ పెద్దకాల్వపల్లెకు చెందిన ఆంజనేయులు (46) వ్యక్తిగత సమస్యలతో తన ఇంటిలో బుధవారం ఉరి వేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.