ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T04:36:57+05:30 IST

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం దౌల్తాబాద్‌ మండలం నర్సంపేట గ్రామంలో చోటు చేసుకుంది.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రాయపోల్‌, అక్టోబరు 19: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం దౌల్తాబాద్‌ మండలం నర్సంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌, ఎస్‌హెచ్‌ఓ మల్లికార్జున్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట గ్రామానికి చెందిన పెరుమాండ్ల ప్రభాకర్‌(27) దౌల్తాబాద్‌లో ఫర్టిలైజర్‌ షాప్‌ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన ప్రభాకర్‌ తన మేన బావకు ఫోన్‌చేసి తాను చనిపోతున్నాని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే ప్రభాకర్‌ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ప్రభాకర్‌ సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


 


Updated Date - 2021-10-20T04:36:57+05:30 IST