యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-02-07T05:35:18+05:30 IST

ఉరి వేసుకొని యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి ఆత్మహత్య
లింగారెడ్డి(ఫైల్‌)

వలిగొండ, ఫిబ్రవరి 6: ఉరి వేసుకొని యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేణిగూడెం గ్రామానికి చెందిన యంపల్లి అంజిరెడ్డి కుమారుడు లింగారెడ్డి(30) హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. అప్పటి నుంచి భయం వేస్తుందని కుటుంబసభ్యులకు తెలుపగా వారు ధైర్యం చెప్పారు. ఈ నేపఽథ్యంలో ఆదివారం వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో ఉన్న తమ సొంత వ్యవసాయ భూమి వద్దకు వెళ్లివస్తానని చెప్పి పొలం సమీపంలో ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబసభ్యులకు  సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రభాకర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

Updated Date - 2022-02-07T05:35:18+05:30 IST