మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-27T06:20:20+05:30 IST
ప్రేమించిన యువతితో మనస్పర్థలు రావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్ సీఐ రమణయ్య బుధవారం తెలిపారు.
ఎంవీపీ కాలనీ, జనవరి 26: ప్రేమించిన యువతితో మనస్పర్థలు రావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్ సీఐ రమణయ్య బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కేఆర్ఎం కాలనీలో నివాసం వుంటున్న సునిత్కుమార్ (21) సాగర్నగర్కు చెందిన యువతిని ప్రేమించాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన సునిత్కుమార్ మంగళవారం తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కేసవరపు సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునిత్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి ఎంవీపీ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.