ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T05:10:06+05:30 IST

ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.

ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

నిజాంపేట, అక్టోబరు 19: ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేట మండలం కోనాపూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌(28) 8 ఏళ్లుగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కల్వకుంటకు బదిలీ అయ్యాడు. పని భారం, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురై సోమవారం రాత్రి సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు విద్యుత్‌ అధికారులను కోరారు.  నిజాంపేట ఎస్‌ఐ ప్రకా్‌షగౌడ్‌ శవపంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. 


Updated Date - 2021-10-20T05:10:06+05:30 IST